Friday, September 27, 2024
HomeతెలంగాణBirpur: బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి

Birpur: బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలి

శిథిలమవుతున్న పాత బ్రిడ్జి..

జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేంద్రం నుండి ఇంద్రనగర్ కు వెళ్లే  రోళ్లవాగు ప్రధాన కెనాల్ పై నిర్మించిన బ్రిడ్జ్ కూలిపోయి ప్రమాదకరంగా మారినందున తక్షణమే బ్రిడ్జ్ నిర్మాణం పనులు ప్రారంభించి పూర్తి చేయాలనీ జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. బీర్ పూర్ మండలం నాయకులు, రైతులతో కలిసి బ్రిడ్జ్ వద్ద వంతెన అడుగు భాగంలో పూర్తిగా బండరాళ్లు కూలిపోయి ప్రమాదకరంగా మారిన బ్రిడ్జ్ ను పరిశీలించారు.

- Advertisement -

ఈ సందర్బంగా వసంత మాట్లాడుతూ బీర్ పూర్ బ్రిడ్జ్ పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, ఎటువంటి ప్రమాదం జరగక ముందే త్వరితగతిన నూతన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ప్రజా రవాణకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసేందుకు మారమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
వారి వెంట కేడిసీసీ జిల్లా మెంబర్ ముప్పాలా రాంచందర్ రావు, మాజీ ఎంపిపి కోల్ములా రమణ తో పాటు  మాజీ ఉపసర్పంచ్ చిర్నేని హరీష్, స్థానిక నాయకులు అప్పల జలంధర్, రాజేశం, అక్కినపెల్లి శ్రీనివాస్, రైతులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News