Friday, September 20, 2024
HomeతెలంగాణKodada: రాజకీయాలను కొందరు నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారు

Kodada: రాజకీయాలను కొందరు నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారు

రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. కేవలం విమర్శలు చేయడం, తిట్టడం ద్వారానే వారు గొప్పదనం వస్తుందని కొందరు అనుకుంటున్నట్టు గుత్తా విమర్శించారు. దేశవ్యాప్తంగా జాతీయ అంతర్జాతీయ ఇండస్ట్రీస్ అన్ని హైదరాబాద్ వైపు చూస్తున్నాయని.. హైదరాబాదుకు ఇండస్ట్రియల్, ఐటీ, కంపెనీలు రావడానికి మంత్రి కేటీఆర్ కృషి చాలా ఉందని గుత్తా అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి మీడియా సమావేశంలో ఈమేరకు గుత్తా మాట్లాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News