Sunday, September 29, 2024
HomeతెలంగాణBirpur: పద్మశాలి మండల కమిటీ అధ్యక్షులుగా ఆడెపు రవికుమార్

Birpur: పద్మశాలి మండల కమిటీ అధ్యక్షులుగా ఆడెపు రవికుమార్

పద్మశాలీల ఉన్నతికి కృషి

జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల కేంద్రములోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆవరణంలో అన్ని గ్రామాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిల ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం మండల కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పద్మశాలి మండల అధ్యక్షులుగా ఆడేపు రవి కుమార్, గౌరవ అధ్యక్షులు మెరుగు రాజేశం, ఉపాధ్యక్షులు చెట్పల్లి సత్యనారాయణ, ఎనగందుల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి భోగ సత్తన్న, కోశాధికారి మెరుగు గంగాధర్, సభ్యులు చెట్ పల్లి శ్రీధర్, నరిమెట్ల సతీష్, కడారి ప్రకాష్, ఆడెపు వెంకటేష్, ఆడెపు జగదీష్, తుపాకుల రాజు, ఎనగందుల మహేష్, మెరుగు రాజమౌళి, శ్యామల రాజు, చెన్న గంగన్న, ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పద్మశాలి సంఘం కులస్తులు తెలిపారు. బీర్ పూర్ మండలంలోని గ్రామలలో కనీసం 350 పద్మశాలి కులస్తుల కుటుంబాలు కలవు అని తెలిపారు.

- Advertisement -

మండల అధ్యక్షుడు  మాట్లాడుతూ పద్మశాలి కుల బంధువులందరికీ అన్ని విధాలుగా ఎల్లవేళల్లో సేవలు అందిస్తానని నూతనంగా ఎన్నికైన పద్మశాలి సంఘం మండల అద్యక్షులు ఆడెపు రవికుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో బీర్ పూర్ మండల అన్ని గ్రామాల పద్మశాలి కుల బంధువులందరు పాల్గొన్నారని వారు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న మండల పద్మశాలి కుల బందువులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ మండలంలో పద్మశాలీల ఉన్నతికి కృషి చేస్తామని, పద్మశాలి సంఘాల అభ్యున్నతికి పాటుపడుతామని పద్మశాలీలంతా ఐక్యంగా ఏకతాటిపై ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. అనంతరము నూతనంగా ఎన్నికైన వారందరికీ శాలువాతో సన్మానము చేశారు. 

  ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News