Friday, October 4, 2024
HomeదైవంJadcharla: శ్రీ గాయత్రి దేవిగా శ్రీ బంగారు మైసమ్మ దేవత

Jadcharla: శ్రీ గాయత్రి దేవిగా శ్రీ బంగారు మైసమ్మ దేవత

దసరా వైభోగం..

దసరా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 44వ జాతీయ రహదారి పక్కన, ఐబి బంగ్లా సమీపంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత 2వ రోజు శుక్రవారం శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ బంగారు మైసమ్మకు తల్లి దేవతకు అభిషేకం అనంతరం నవరాత్రోత్సవ పూజలు వైభవంగా నిర్వహించారు.

- Advertisement -

భక్తులు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గోనెల నరేందర్, ఘనాతే విజయ్ కుమార్, గుండు చంద్ర శేఖర్, భక్తులు మహేశ్వరి, మాధురి, మహేష్, బుక్క రాజు, సంధ్య, సీత, శ్రీనివాసులు, శివ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News