Saturday, April 19, 2025
HomeతెలంగాణJadcharla: అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

Jadcharla: అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

రంగనాయక స్వామి ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు రాంరెడ్డి

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని శ్రీ రంగనాయక స్వామి దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రాంరెడ్డి అన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట గ్రామ చావిడి దగ్గర దుర్గమాత కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవీ నవరాత్రి ఉత్సవాలలో గాయత్రీ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని శ్రీ రంగనాయక స్వామి దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రాంరెడ్డి ఆయన సతీమణి రాధికా రెడ్డిలు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -

కమిటీ సభ్యులు రాంరెడ్డి దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాగరాజు, నరేష్, నవీన్, రాకేష్, శివ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News