Saturday, October 5, 2024
HomeతెలంగాణGarla: ఆలయ అభివృద్ధికి పాటుపడాలి ఎమ్మెల్యే కోరం కనకయ్య

Garla: ఆలయ అభివృద్ధికి పాటుపడాలి ఎమ్మెల్యే కోరం కనకయ్య

బ్రహ్మోత్సవాలకు రావాలంటూ ఆహ్వానం..

వేటవెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. శనివారం గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం వేట వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన ఆయనకు ఎండోమెంట్ కార్యనిర్వాహక అధికారిని సమత అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొని ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

దేవాదాయ శాఖ కార్యనిర్వాహక అధికారిని అర్చకుల సమూహం ఎమ్మెల్యేకు శాలువాతో ఘనంగా సన్మానం చేసి ధ్వజస్థంభ ప్రతిష్టాపన స్వామివారి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం ఆయన ధ్వజస్థంభ ప్రతిష్టాపన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. వేట వెంకటేశ్వర స్వామి దేవాలయం పుణ్యక్షేత్రం వలె మరింతగా అభివృద్ధి చెందేందుకు దాతలు తోడ్పాటును అందించాలన్నారు అదేవిధంగా దుర్గాదేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని మర్రిగూడెం గ్రామంలో కాంతారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధనియకుల రామారావు పిఎసిఎస్ సొసైటీ డైరెక్టర్ శీలంశెట్టి ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండ రామ గౌడ్ భూక్య నాగేశ్వరరావు గోదా నరేందర్ యాకుబ్ పాషా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి కస్నానాయక్ రమేష్ బాబు పరుచూరి వెంకటేశ్వర్లు కందునూరి ఉపేందర్ మల్లం నరేందర్ అశోక్ రామ్ సింగ్ హరి నాయక్ కట్ట శీను మన్నెపెల్లి సైదయ్య మల్లిబాబు గోపి అర్చకులు అచ్చుత్ రాము స్వాములు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News