Tuesday, October 8, 2024
HomeతెలంగాణNagarkurnool: తెలుగుప్రభ ఎఫెక్ట్, ఆ స్కూల్ కు షోకాస్ నోటీసులిచ్చిన డీఈవో

Nagarkurnool: తెలుగుప్రభ ఎఫెక్ట్, ఆ స్కూల్ కు షోకాస్ నోటీసులిచ్చిన డీఈవో

ఇదేం స్కూల్ రా నాయనా..

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రిజం ద స్కూల్ యాజమాన్యం విద్యార్థిని చితకబాదడం, బతుకమ్మ పువ్వుల కోసం విద్యార్థులను చెట్లపదల్లోకి పంపించడం, విద్యార్థులకు విద్యను బోధించే సమయంలో విద్యార్థులచే బతుకమ్మలను తయారు చేయించడం, ఇలా ఏదో ఒక సంఘటనతో నిత్యం వార్తల్లోకి ఎక్కుతోంది.

- Advertisement -

అయితే ‘విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం’ వార్త శీర్షిక కథనం ‘తెలుగుప్రభ’ దినపత్రికలో ప్రచురితం కావడంతో స్పందించిన (డీఈవో) జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ప్రిజం ద స్కూల్ యాజమాన్యానికి షోకాస్ నోటీసులు జారీ చేశారు.
ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని చితకబాదిన టీచర్ శీర్షిక కథనం తెలుగుప్రభ దినపత్రికలో ప్రచూరితం అయ్యింది. వరుసగా ప్రిజం స్కూల్లో జరుగుతున్న సంఘటనలపై జిల్లా విద్యాశాఖ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రిజం స్కూల్ యాజమాన్యంపై మెమో జారీ చేసి, విచారణ కోరగా.. యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో షోకాస్ నోటీసులు జారీ చేశారు. షోకాస్ నోటీసులకు ప్రిజం స్కూల్ యాజమాన్యం ఎలాంటి సమాధానం చెబుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

“ప్రిజం ద స్కూల్ లో నిత్యం ఏదో ఒక సంఘటనతో. పత్రికల్లోకెక్కడం మా దృష్టికి వచ్చింది. ముందుగా మెమో జారీ చేశాం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో షోకాస్ నోటీసులు జారీ చేశాం. సరైన విచారణ జరిపి ప్రిజం స్కూల్ పై చర్యలు తీసుకుంటాం”.
నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News