Tuesday, October 8, 2024
HomeతెలంగాణJadcharla: శ్రీ మహాలక్ష్మి దేవిగా బంగారు మైసమ్మ దేవత

Jadcharla: శ్రీ మహాలక్ష్మి దేవిగా బంగారు మైసమ్మ దేవత

మహాలక్ష్మి దేవిగా..

దసరా శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 44వ జాతీయ రహదారి పక్కన, ఐబి (డాగ్) బంగ్లా సమీపంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత 6వ రోజు మంగళవారం శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

- Advertisement -

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కావేరమ్మపేట, జడ్చర్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు పున్న కాశీ విశ్వనాథ్ సుధ దంపతులు హాజరై ముందుగా గణపతి పూజ నిర్వహించి, శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతకు అభిషేకం, దేవి నవరాత్రోత్సవ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించి అన్నం పాయసం నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గోనెల నరేందర్ మహేశ్వరి దంపతులు, ఘనాతే విజయ్ కుమార్, భక్తులు శ్రీనివాసులు సీత, జయమ్మ, నరేష్ నాయక్, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News