Friday, October 11, 2024
HomeఆటChityala: ముగిసిన వట్టిమర్తి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు

Chityala: ముగిసిన వట్టిమర్తి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో గత మూడు రోజులుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన వట్టిమర్తి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసాయి. నర్రా వేణుగోపాల్ రెడ్డి (చెన్నై సూపర్ కింగ్స్), వర్సెస్ మేడి రమేష్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) జట్లు ఫైనల్స్ లో హోరాహోరీగా తలపడ్డాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో మేడి రమేష్ టీం విజయం సాధించింది.

- Advertisement -

విజేతలను తోటి క్రీడాకారులు అభినందించారు. విజేతలకు పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు కె. రాఫెల్, మాజీ సర్పంచ్ బుర్రి రవీందర్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్రా కిషోర్ రెడ్డి, బూరుగు సైదులు, అంతటి మహేష్, సాగర్ల నరేష్, జాల సత్యనారాయణ, చింతపల్లి వెంకన్న, మేడి హరికృష్ణ, నర్రా బిక్షం రెడ్డి, మేడి శ్రీను, వీరస్వామి, దూదిగామ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News