Monday, October 14, 2024
HomeదైవంGarla: భక్తిశ్రద్ధలతో వేద పారాయణం యాగశాల ప్రవేశం

Garla: భక్తిశ్రద్ధలతో వేద పారాయణం యాగశాల ప్రవేశం

ధ్వజస్థంభ పునః ప్రతిష్ఠ..

గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామంలోని శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపనలో భాగంగా ఆలయ కార్యనిర్వాహక అధికారిని సమత ఆధ్వర్యంలో మొదటిరోజు ఆలయ అర్చకులు అచ్యుత్ ఆచార్య రాముస్వామి పర్యవేక్షణలో వేద పండితులు వేద పారాయణం చేసి యాగశాల ప్రవేశం యజ్ఞం ప్రారంభించి ధ్వజస్తంభానికి అభిషేకం చేసి పూజలు నిర్వహించి పూర్ణాహుతి హోమం నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ దాతలు పులి గోపాల్ రెడ్డి ప్రమీల దేవి దంపతులు రమేష్ బాబు శ్రీనివాస్ గుప్తా కందునూరి ఉపేందర్ మల్లం నరేందర్ పరికిషన్ పుల్ల ఖండం వేణుగోపాల్ కవిత దంపతులు ఒబిలి శెట్టి కృష్ణ వేమిశెట్టి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News