Monday, October 14, 2024
HomeతెలంగాణJagityala: రైతులకు ఇబ్బందులు కలగకుండా మార్కెట్ పాలక వర్గం చూడాలి

Jagityala: రైతులకు ఇబ్బందులు కలగకుండా మార్కెట్ పాలక వర్గం చూడాలి

లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మార్కెట్ పాలక వర్గం పైన ఉందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు అన్నారు. ధర్మపురి మార్కెట్ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోమవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, వైస్ చైర్మన్ సంగ నర్సింహులు మరియు డైరెక్టర్ల చేత జిల్లా మార్కెట్ అధికారి ప్రమాణ స్వీకారాన్ని చేయించారు, అనంతరం నూతనంగా నియామకమైన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం అనంతరం మనం పొందాలనుకున్న ఫలాలు పొందడంలో జాప్యం జరిగిందని, వాటిని తిరిగి సాధించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతుందనీ, ఈ ప్రాంత సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ముందుండటం జరుగుతుందని ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పాలనను నన్ను మరిపించే విధంగా కొనసాగించడం జరుగుతుంది, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగ కుండా చూసుకోవాల్సిన బాధ్యత మార్కెట్ పాలక వర్గం పైన ఉంటుందనీ,ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనీ అన్నారు. దేశంలో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా రుణమాఫీ అమలు చేశారా అని, కేవలం కాంగ్రెస్ పాలిత ప్రాంతంలోనే రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, చేగ్యం బాధితులకు వారి పరిహారం అందించడం, గత ప్రభుత్వంలో సాధ్యంకాని నైట్ కాలేజ్ ని తిరిగి ప్రారంభించిన ఘనత ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కే చెందుతుందనీ ఈ సందర్భంగా తెలిపారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వ అరాచక పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురికావడం జరిగిందని, గత ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కొప్పుల ఈశ్వర్ కనీసం ఇక్కడి రైతుల గురించి ఆలోచించ లేదని, రైతులను కట్టింగ్ పేరుతో నిలువునా రైస్ మిల్లర్లు దోచుకుంటుంటే మంత్రి హోదాలో కనీసం స్పందించ లేదని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2, లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రుణాలను మాఫీ చేసి చూపించామని, అన్నారు. జగిత్యాల జిల్లాకు సంబంధించి 80, శాతం వరకు రుణమాఫీ పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 20, శాతం రైతులకు రుణాలకు మాఫీ చేసి తీరుతామని తెలిపారు. ఈ ప్రాంత ఇరిగేషన్ విషయంలో కూడా ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రిని కలిసి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, త్వరలోనే పత్తిపాక రిజర్వాయర్ ను పూర్తి చేసి రైతాంగానికి నీటిని అందిస్తామని, లిఫ్ట్ లకు కూడా మరమ్మతులు పూర్తి చేయించి తిరిగి వాడుకలోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. రోళ్ళ వాగు ప్రాజేక్ట్ కూడా అంచనా వ్యయం పెంచినప్పటికీ దాన్ని గత ప్రభుత్వంలో పూర్తి చేయలేకపోయారని దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఎవ్వరికీ ఎటువంటి అవసరం ఉన్న నేరుగా నన్ను కలవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News