Saturday, October 19, 2024
HomeతెలంగాణSangareddy: దద్దరిల్లిన సదాశివపేట

Sangareddy: దద్దరిల్లిన సదాశివపేట

సెంటిమెంట్ పై దాడి చేస్తారా?

స్థానిక ప్రభు మందిర్ దగ్గర ఉన్న హనుమాన్ మందిరంలోని గణేష్ విగ్రహం, హనుమంతుని విగ్రహానికి ధ్వంసం చేసినందుకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, హిందూ సంఘాల పిలుపు మేరకు శనివారం నాడు సదాశివపేట పట్టణంలో బంద్ నిర్వహించారు.

- Advertisement -

ఈ బందుకు కులాలకు అతీతంగా వచ్చి మద్దతు ప్రకటించారు. సదాశిపేట బందుతోపాటు పురవీధుల గుండా నిరసన ర్యాలీ నిర్వహిస్తూ ప్రతి మందిరం దగ్గర హనుమాన్ చాలీసా పారాయణము, లింగాష్టక పారాయణము చేసుకుంటూ వెళ్లి, స్థానిక పోలీస్ స్టేషన్లో డిఎస్పీకు మెమొరండం ఇచ్చారు. ఈ చర్యకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఇకముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని డిఎస్పీని కోరారు.

ఈ కార్యక్రమంలో తంగడపల్లి మల్కేడ్ అప్ప , విశ్వహిందూ పరిషత్ నాయకులు బజరంగ్దళ్ నాయకులు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News