Thursday, April 17, 2025
HomeతెలంగాణJadcharla: విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కౌన్సిలర్ వినతి

Jadcharla: విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కౌన్సిలర్ వినతి

సారూ..జర సూడుర్రి..

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని జడ్చర్ల డివిజనల్ కార్యాలయంలో 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

జడ్చర్ల డివిజనల్ కార్యాలయంలో జరిగిన విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా – రంగారావు తోట మెయిన్ రోడ్డు నుంచి వెంకట్రావు ఇంటి నుంచి రామకృష్ణ శర్మ ఇంటి నుంచి ఫేస్-1 నుంచి ఫేస్ 3గా లైన్ మార్పు చేయాలని, వెంకట పతారావు కాలనీకి 160కేవీఏ ట్రాన్స్ ఫార్మర్ శాంక్షన్ అయిందని దానిని 100 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో బిగించాలని, సంతోషి మాత ఆలయం పక్కన 100 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్ లోడ్ ఎక్కువ కావడం ఇండ్లల్లో ఎలక్ట్రిక్ వస్తువులు తరచూ కాలి పోతున్నాయని, వాటి స్థానంలో 160 కెవి ట్రాన్స్ ఫార్మర్ బిగించాలని, అదే విధంగా అయోధ్య నగర్, చైతన్య నగర్ ప్రాంతాల్లో పోల్స్ బిగించి లైన్ వేయాలని కౌన్సిలర్ తన వినతి పత్రంలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News