Wednesday, October 23, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Politics: వాడివేడిగా ఏపీ రాజకీయాలు.. రేపు ఏం జరగనుంది..?

AP Politics: వాడివేడిగా ఏపీ రాజకీయాలు.. రేపు ఏం జరగనుంది..?

AP Politics| ఏపీ రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీ(YCP) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓవైపు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ(TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తుంటే.. మరోవైపు జగన్ అండ్ కో కూటమి నాయకులు అరాచకాలు చేస్తున్నారంటూ కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలోనే రేపు(గురువారం) ఏపీ రాజకీయాల్లో సంచలన విషయాలు బయటపడనున్నాయి. ఈమేరకు టీడీపీ, వైసీపీ తమ ఎక్స్ ఖాతాల నుంచి బ్రేకింగ్ పోస్టర్‌లు విడుదల చేశాయి. దీంతో రేపు ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

ముందుగా తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదికగా ఓ పోస్టర్ విడుదల చేసింది. ‘రేపు అనగా అక్టోబర్ 24 మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్‌పోజ్ వస్తుంది. ఎదురుచూస్తూ ఉండండి’ అని ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ వార్త ఏమై ఉంటుందనే చర్చ మొదలైంది. ఏదైనా పెద్ద కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుందా..? లేదంటే వైసీపీ నాయకులకు సంబంధించి ఏదైనా సంచలన వార్త అయి ఉంటుందా..? అంటూ జనాలు జోరుగా చర్చించున్నారు.

టీడీపీ పోస్ట్ చేసిన కాసేపటికే వైసీపీ కూడా తన ‘X’ ఖాతాలో (ట్విట్టర్) వేదికగా సంచలన పోస్ట్ చేసింది. ‘ట్రూత్‌ బాంబ్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి. అక్టోబర్ 24న మధ్యాహ్నం 12 గంటలకు డ్రాప్ అవుతోంది. స్టే ట్యూన్’ అంటూ ట్వీట్ చేసింది. అందుకు సంబంధించి ‘ప్రిపేర్ ఫర్ ద బిగ్ రివీల్’ అనే పోస్టర్‌ను కూడా పోస్ట్ చేసింది. దీంతో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ, కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏ వ్యవహారాన్ని బయటపెట్టపోతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. మొత్తానికి అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీల సంచలన పోస్టర్లతో రాష్ట్ర రాజకీయాల్లో రేపు(అక్టోబర్‌ 24) బిగ్ డే కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News