Saturday, October 5, 2024
HomeతెలంగాణJagadish Reddy: మోటర్లకు మీటర్లు పెట్టేదే లే

Jagadish Reddy: మోటర్లకు మీటర్లు పెట్టేదే లే

ప్రభుత్వ రంగసంస్థలను తమ తాబేదారులకు మోదీ సర్కార్ కట్టబడుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అందుకు అనుగుణంగా తక్కువ ధరలకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సూర్యాపేటకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్యస్ లో చేరిన నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ..మోదీ పాలనలో వారి వారి అనుచరులకు ప్రభుత్వ ఆస్తులు దోచి పెట్టడం మినహా సామాన్య ప్రజలకు ఒరగ బెట్టింది ఏమి లేదంటూ ఘాటుగా విమర్శించారు. దానికి తోడు విద్యుత్ రంగాన్ని ప్రైవేటికరించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసిందన్నారు. ప్రైవేటు సంస్థల డిమాండ్ మేరకే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తుందన్నారు.

- Advertisement -

ఇక్కడి బిజెపి గల్లీ నాయకులు అవగాహన లేక అజ్ఞానంతో తప్పుడు ప్రచారానికి దిగ జారుతున్నారని ఆయన దుయ్యబట్టారు. పెరిగిన డిమాండ్ కనుగుణంగా విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.
తెలంగాణాలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టె ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా మోటర్లకు మీటర్ల పెట్టబోము అంటూ నిండు సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలను మంత్రి జగదీష్ రెడ్డి ఉటంకించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News