Saturday, October 26, 2024
Homeనేషనల్TPCC chief Delhi tour: ఢిల్లీలో బిజీబిజీగా టీపీసీసీ చీఫ్

TPCC chief Delhi tour: ఢిల్లీలో బిజీబిజీగా టీపీసీసీ చీఫ్

ఖ‌ర్గే, రాహుల్ తో భేటీ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ బి. మ‌హేష్‌కుమార్ గౌడ్ దేశ రాజ‌ధాని ఢిల్లీలో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కు ఢిల్లీ వెళ్లిన ఆయ‌న శ‌నివారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీల‌తోతో భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షులుడి మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

అనంతరం అక్కడే రాహుల్ గాంధీతో సుమారు 10 నిమిషాలపాటు సమావేశం అయ్యారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల‌ను వారికి వివరించారు.

టీపీసీసీ అధ్య‌క్షుడుగా తాను బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత జ‌రిగిన ఈ యాభై రోజుల్లో పార్టీలోను, ప్ర‌భుత్వంలోనూ జరిగిన పలు ముఖ్యమైన రాజకీయ కార్యక్రమాల వివరాల‌ను మ‌హేష్‌గౌడ్ వారికి వివ‌రించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News