Friday, September 20, 2024
HomeదైవంAhobilam: అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుండి

Ahobilam: అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుండి

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఎగువ, దిగువ శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు మఠం ప్రతినిధి సంపత్ వెల్లడించారు. ఎగువన అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకు 46వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శఠగోప యతింద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ప్రారంభిస్తారు. శనివారం నుండి ప్రారంభమై వచ్చేనెల మార్చి 8 వరకు దిగువ అహోబిలంలో గరుడోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాలకు అన్ని జిల్లాలు ఉండే కాక ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలి వస్తారని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని మఠం ప్రతినిధి సంపత్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News