Sunday, October 27, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు జగన్.. షర్మిల ఘాటు విమర్శలు

YS Sharmila: తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు జగన్.. షర్మిల ఘాటు విమర్శలు

YS Sharmila| ఆస్తి వివాదంలో వైఎస్సార్ కుటుంబ రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan).. ఆస్తి కోసం సొంత తల్లి వైఎస్ విజయమ్మ(YS Vijayamma) మీదే కోర్టులో కేసు వేశారని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి షర్మిల తీరును ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) స్పందిస్తూ జగన్ బెయిల్ రద్దుకు షర్మిల ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయిరెడ్డి వ్యాఖ్యలపై షర్మిల కూడా అంతే ఘాటుగా స్పందిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

“సాయి రెడ్డి గారు.. మీరు చదివింది జగన్ మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా ? ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ .. అబద్ధం అని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ? మీరు కూడా జగన్ మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగిన వాళ్ళే. రాజకీయంగా,ఆర్థికంగా జగన్ గారి వల్ల బలపడిన వాళ్ళే. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే. YSR మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది YSR . బంగారు బాతును ఎవరు చంపుకోరు. సొంత కళ్లను ఎవరు పొడుచుకోరు.

YSR మరణానికి చంద్రబాబు గారు కారణం అయితే మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా ? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు ? దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయట పెట్టలేదు ? దోషులను ఎందుకు శిక్షించలేదు ? అనుమానం ఉండి, 5 ఏళ్లు అధికారంలో ఉండి, ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు ? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా ? YSR మరణం తర్వాత చార్జిషీట్ లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు కాదా ? కేసుల నుంచి బయట పడటానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చేయలేదా ? చేయకపోతే జగన్ గారు సీఎం అయిన వెంటనే, మొదటగా అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇచ్చారు ? ఇప్పుడు మళ్ళీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన విషపు నాగు జగన్ గారు కాదా ?

చంద్రబాబు గారితో నాకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. YSR తన బిడ్డ పెళ్లికి చంద్రబాబు గారిని పిలిచారు. అలాగే నేను కూడా పిలిచాను. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే.. నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్ళకు సభ్యతా సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి ? జగన్ గారికి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ? ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. చంద్రబాబే కనిపిస్తున్నట్లుంది. చంద్రబాబు గారి కళ్ళల్లో ఆనందం చూడటానికో.. ఆయన బ్రాండింగ్ ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో.. పని చేయాల్సిన అవసరం YSR బిడ్డకు ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నా” అని షర్మిల స్పష్టంచేశారు.

ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల రాజకీయంగా ఒంటరి అయ్యారని టీటీడీ మాజీ చైర్మర్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్ ఇప్పటి వరకు ఏ తప్పూ చేయలేదన్నారు. జగన్ లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని.. ఇచ్చిన మాట కోసం సర్వం వదులుకుంటారని పేర్కొన్నారు. అశేష ప్రజల ప్రేమాభిమానాలు పొందిన వైఎస్సార్ ప్రతిష్టను షర్మిల దిగజార్చేలా చేయడం బాధాకరమని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News