Monday, October 28, 2024
Homeచిత్ర ప్రభVenu Swamy: వేణుస్వామికి భారీ షాక్.. చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు

Venu Swamy: వేణుస్వామికి భారీ షాక్.. చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు

Venu Swamy| సినీ, రాజకీయ సెలబ్రెటీల జ్యోతిష్యాలు చెబుతూ ఫేమస్ అయిన వేణుస్వామికి భారీ షాక్ తగిలింది. వారంలోగా వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్న తర్వాత వారు త్వరలోనే విడిపోతారని ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి తెలిపాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదుచేసింది.

- Advertisement -

దీంతో తమ ముందు విచారణకు హాజరుకావాలని వేణుస్వామిని మహిళా కమిషన్ ఆదేశించింది. అయితే ఈ నోటీసులపై వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించి తనపై చర్యలు తీసుకోకుండా స్టే తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఆ స్టే ఉత్తర్వులను ఎత్తివేస్తూ మహిళా కమిషన్‌కు చర్యలు తీసుకోవడానికి పూర్తి అధికారాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టంచేసింది. వారం రోజుల్లోగా వేణుస్వామిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కాగా వేణుస్వామి సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించి జ్యోతిష్యం చెబుతూ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా నాగచైతన్య – సమంత జంట విడిపోతుందని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే వారిద్దరు విడిపోవడంతో వేణుస్వామి పేరు మార్మోగింది. అప్పటి నుంచి ప్రముఖులు జీవితాల గురించి జ్యోతిష్యాలు చెబుతూ నిత్యం వార్తల్లో నిలిచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని.. టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలుస్తుందని.. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అయితే ఇవేమీ జరగకపోవడంతో వేణుస్వామి తీవ్రమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు. అయినా కానీ నాగచైతన్య-శోభిత విడిపోతారంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిల్మ్ జర్నలిస్ట్స్ ఫిర్యాదుచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News