Monday, May 19, 2025
HomeతెలంగాణMP Raghu Rama Krishna Raju : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్‌

MP Raghu Rama Krishna Raju : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్‌

MP Raghu Rama Krishna Raju : న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ షాకిచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని నోటీసులు ఇచ్చింది. 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు అంద‌జేసింది. బంజారాహిల్స్‌లోని సిట్ కార్యాల‌యంలో ఈ నెల 29న జ‌రిగే విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని నోటీసుల్లో పేర్కొంది.

- Advertisement -

ఎమ్మెల్యేల‌కు ఎర కేసు ద‌ర్యాప్తులో భాగంగా ఎంపీ ర‌ఘురామ‌కు సంబంధించిన ప‌లు కీల‌క విష‌యాల‌ను సిట్ సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రామ‌చంద్రాభార‌తి, నంద‌కుమార్‌, సింహ‌యాజిల‌తో ర‌ఘురామ ట‌చ్‌లో ఉన్న‌ట్లు. ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ.100 కోట్లు స‌మ‌కూరుస్తాన‌ని ఆయ‌న చెప్పిన‌ట్లు సిట్ అనుమానం వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చింది.

రామ‌చంద్రాభార‌తి, నంద‌కుమార్‌, సింహ‌యాజిల‌ను ఇప్ప‌టికే ఈ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్‌, భార‌తీయ ద‌ర్మ‌జ‌న‌సేన చీఫ్ తుషార్‌, కేర‌ళ డాక్ట‌ర్ డా.జ‌గ్గుస్వామి, న్యాయ‌వాది శ్రీనివాస్‌ ల‌కు సిట్ ఇప్ప‌టికే నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News