Sunday, October 6, 2024
HomeతెలంగాణTanduru: రాష్ట్రంలో BJPని అధికారంలోకి తెద్దాం

Tanduru: రాష్ట్రంలో BJPని అధికారంలోకి తెద్దాం

కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన పథకాలు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదని తాండూరు బీజేపీ మండిపడింది. ఆయుష్మాన్ భారత్‌ పథకం మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే కేసీఆర్‌ పథకాన్ని తుంగలో తొక్కారని బీజేపీ తాండూరు అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ ఆరోపించారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు ఆయుష్మాన్‌ భారత్‌కు అర్హులని, కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దానిని వారికి దూరం చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వేదిక, శ్మశాన వాటికల నిర్మాణాలకు నిధులు ఇస్తున్నా కేసీఆర్‌ తామే ఇస్తున్నట్లు గొప్పలు చెప్పు కోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

- Advertisement -

రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల ముందుకు తెచ్చేందుకే ప్రజా గోస-బీజేపీ భరోసా – కార్నర్ మీటింగ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News