Tuesday, March 11, 2025
HomeతెలంగాణKTR: ఏసీబీ కేసుపై స్పందించిన కేటీఆర్

KTR: ఏసీబీ కేసుపై స్పందించిన కేటీఆర్

తనపై నమోదైన ఏసీబీ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ప్రజలకు వాస్తవాలు తెలిసేలా అసెంబ్లీలోనే ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌(Formula-E car racing) వ్యవహారంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. సమాధానం చెప్పడానికి తాను సిద్ధమని వెల్లడించారు. ఏదో కుంభకోణం జరిగిందంటున్నారని.. చర్చ పెడితే అసెంబ్లీలోనే సమధానం చెబుతానని తెలిపారు.

- Advertisement -

కాగా ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిని చేర్చింది. కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో.. దీనిపై విచారణ చేయాలని సీఎస్‌ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News