Sunday, October 6, 2024
Homeనేషనల్Rahul Gandhi : రాహుల్ ని చంపేస్తామన్న వ్యక్తికి అరదండాలు

Rahul Gandhi : రాహుల్ ని చంపేస్తామన్న వ్యక్తికి అరదండాలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న విషయం తెలిసిందే. ఈ యాత్ర చేస్తుండగానే గతంలో ఓ వ్యక్తి రాహుల్ గాంధీని చంపేస్తామని బెదిరిస్తూ రాసిన ఓ లేఖ బేకరీ వద్ద లభ్యమైంది. రాహుల్ భారత్ జోడో యాత్ర ఇండోర్‌కు చేరుకోగానే బాంబు పేల్చి రాహుల్‌ను హతమారుస్తానంటూ హెచ్చరించిన ఆ వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉజ్జయినిలోని నగ్డా ప్రాంతంలో దయా అలియాస్ ప్యారే అలియాస్ నరేంద్రసింగ్‌ను అదుపులోకి తీసుకుని ఇండోర్ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

రాహుల్ ను చంపేస్తామని బెదిరించిన వ్యక్తి కోసం పోలీసులు దాదాపు 200 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆరు నగరాల్లోని హెటళ్లు, లాడ్జీలు, రైల్వే స్టేషన్లలో జల్లెడ పట్టగా.. నిందితుడు రాయబరేలికి చెందిన వాడని తేలింది. అతను గతంలోనూ లేఖలు, ఫోన్ల ద్వారా చాలామందిని బెదిరించాడని పోలీసులు తెలిపారు .ఇండోర్‌లోని ఖల్సా స్టేడియంలో గతంలో జరిగిన కార్యక్రమానికి నిందితుడు హాజరైనట్లు పేర్కొన్నారు. అదే కార్యక్రమంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూడా పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News