Saturday, April 19, 2025
Homeనేరాలు-ఘోరాలుKarnataka: కాల్పులతో రెచ్చిపోయిన దొంగలు.. డబ్బులు లాక్కొని పరారీ

Karnataka: కాల్పులతో రెచ్చిపోయిన దొంగలు.. డబ్బులు లాక్కొని పరారీ

కర్ణాటక(Karnataka)లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బీదర్‌లోని శివాజీ చౌక్‌లో ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలోని ఏటీఎం కేంద్రంలో డబ్బు పెట్టేందుకు సిబ్బంది వచ్చారు. అదే సమయంలో ఓ ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు.

- Advertisement -

అనంతరం డబ్బులను తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News