ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట దొరకనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) బడ్జెట్(Union Budget 2025) ప్రసంగంలో తెలిపారు. ఈసారి ట్యాక్స్ సహా ఆరు సంస్కరణలు చేపట్టబోతున్నట్లు వివరించారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. తాజా మార్పులతో కూడిన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును వచ్చే వారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. మరోవైపు పట్టణ పేదల కోసం రూ.30 వేల పరిమితితో యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -