కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్(Union Budget 2025)లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి నిధులు కేటాయించారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు పోలవరం ప్రాజెక్టుతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు నిధులు కేటాయిస్తూ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.
₹ పోలవరం ప్రాజెక్టు: రూ.5,936 కోట్లు
₹ పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు: రూ.12,157 కోట్లు
₹ విశాఖ స్టీల్ ప్లాంట్: రూ.3,295 కోట్లు
₹ విశాఖ పోర్టు: రూ.730 కోట్లు
₹ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్కు మద్దతుగా: రూ.375 కోట్లు
₹ ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశ: రూ.242.50 కోట్లు
₹ రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి: రూ.240 కోట్లు
₹ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162 కోట్లు
₹ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్: రూ.186 కోట్లు