Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్‌

Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్‌

ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)ను నటుడు సోనూసూద్‌(Sonusood) సచివాలయంలో కలిశారు. సోనూసూద్‌ ఫౌండేషన్‌ ద్వారా ఏపీ ప్రభుత్వానికి నాలుగు అంబులెన్స్‌లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసిన సోనూసూద్‌.. అంబులెన్స్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అనంతరం నాలుగు అంబులెన్స్‌లను చంద్రబాబు ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఇందులో సోనూసూద్‌ ఫౌండేషన్ భాగస్వామి అయినందుకు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News