ఢిల్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో.. ఇప్పుడు అందరి దృష్టి రిజల్ట్ పైనే ఉంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటరు పట్టం కట్టాడనేది మాత్రం ఫిబ్రవరి 8వ తేదీ స్పష్టం కానుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్లు గెలుపు తమదేనంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 6 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. కాసేపటికే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయో ఇప్పుడు చూద్దాం.
పీపుల్స్ పల్స్: బీజేపీ 51 -60 సీట్లు, ఆమ్ ఆద్మీ 10-19, కాంగ్రెస్ -0
ఆత్మసాక్షి: బీజేపీ 38-41, ఆమ్ ఆద్మీ 27-30, కాంగ్రెస్ 1-3.
పోల్ ఆఫ్ పోల్స్: బీజేపీ-40, ఆమ్ ఆద్మీ-30, కాంగ్రెస్-0,
ఏబీపీ మ్యాట్రిజ్: బీజేపీ – 35-40 సీట్లు, ఆమ్ ఆద్మీ – 32-37 సీట్లు, కాంగ్రెస్ – 0-1 సీట్లు,
రిపబ్లిక్ పీ మార్క్: బీజేపీ – 39-49 సీట్లు, ఆమ్ ఆద్మీ – 21-31 సీట్లు, కాంగ్రెస్ – 0-1,
ఢిల్లీ టైమ్స్ నౌ: బీజేపీ – 39-45 సీట్లు, ఆమ్ ఆద్మీ – 22-31 సీట్లు, కాంగ్రెస్ 0,
చాణిక్య స్ట్రాటజీస్: బీజేపీ – 39-44 సీట్లు, ఆమ్ ఆద్మీ – 25-28 సీట్లు, కాంగ్రెస్ -0,
పీపుల్స్ ఇన్సైట్: బీజేపీ – 40-44 సీట్లు, ఆప్ – 25-29 సీట్లు, కాంగ్రెస్ – 0-1.
అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు తీవ్ర ఉత్కంఠగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అందుకుంటాయా లేక తలకిందులు చేస్తాయా అనేది తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.