జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని(Kaleshwaram) శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో మహాఘట్టం మహాకుంభాభిషేకం(maha kumbhabhishekam) ఘనంగా నిర్వహించారు. తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ఈ మహకుంభాభిషేకం పూజలు వైభవంగా జరిగాయి. రాజగోపురాలకు సంప్రోక్షణ పూజలు, కుంభాభిషేకం కన్నుల పండుగగా నిలిచాయి.
- Advertisement -
ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపం వద్ద పీఠాధిపతికి స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు. మహాకుంభాభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.