కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు(Supreme Court)లో నేడు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు. స్పీకర్ నుంచి సమాచారం కోసం మరింత సమయం కావాలని కోర్టును కోరారు. ఇప్పటికే 10 నెలలు పూర్తయిందని.. ఇంకెంత గడువు కావాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కే.వినోద్ చంద్రన్ ద్విసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దీంతో తమ నిర్ణయం తెలిపేందుకు మరో నాలుగైదు రోజులు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. రోహత్గీ విజ్ఞప్తితో తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.
కాగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు అన్నింటిని కలిపి సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.