భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ(Abhijit Mukherjee) తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ సార్టీ గెలుపొందిన తర్వాత అభిజిత్ ముఖర్జీ ఆ పార్టీలో చేరారు. నాలుగేళ్ల పాటు టీఎంసీలో ఉన్న అభిజిత్.. తాజాగా మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పీసీసీ చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ వ్యక్తి ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలోకే తిరిగి వస్తాడని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడటం పొరపాటు అని ఇందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు.
కాగా అభిజిత్ ముఖర్జీ రాజకీయాల్లోకి రాకముందు ప్రముఖ కార్పొరేట్ సంస్థల్లో పని చేశారు. ప్రణబ్ ముఖర్జీ 2012లో రాష్ట్రపతి అయ్యాక బెంగాల్లోని జాంగీపూర్ స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. అయితే 2019లో మాత్రతం తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.