పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో అద్భుతంగా నటించింది.
ముకుంద సినిమాలో సంప్రదాయబద్ధంగా కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత తనలో హాట్ యాంగిల్స్ చూపించి కుర్రాళ్లను పిచ్చోళ్లను చేసింది.
అందం, అభినయం, డ్యాన్స్తో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. టాలీవుడు స్టార్ హీరోలు మహేష్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో నటించింది.
అయితే పూజాకు ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఆఫర్లు తగ్గాయి.
ఒక లైలా కోసం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.
అయితే గత కొంతకాలంగా పూజాకు వరుస ఫ్లాప్ లు వచ్చాయి. దీంతో ఐరన్ లెగ్ అంటూ ప్రచారం జరిగింది. తెలుగులో ఆఫర్లు తగ్గాయి.. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
గత కొన్నిరోజులుగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన సినిమాలు ఏవీ వర్కవుట్ అవ్వకపోవడంతో తన ఆశలన్నీ ప్రస్తుతం దేవ పైనే ఉన్నాయి. ఇక తాజాగా పూజా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి.