Friday, February 21, 2025
HomeNewsAmbati Rambabu: రాష్ట్ర డీజీపీ తీరు అత్యంత దారుణం: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్

Ambati Rambabu: రాష్ట్ర డీజీపీ తీరు అత్యంత దారుణం: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్

రాష్ట్ర డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా చట్టాలను పరిరక్షించేందుకు పనిచేయాలే తప్ప రాజకీయ కక్షలకు పోలీస్ యంత్రాంగం సహకరిస్తుంటే ఉపేక్షించడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై పోతోందన్నారు. రాజకీయ కక్షలకు పావులుగా మారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమ అరెస్ట్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసుల నమోదుపై డీజీపీని కలిసేందుకు ప్రయత్నించిన సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని మంగళగిరి డీజీపీ కార్యాలయం వద్ద మండిపడ్డారు

- Advertisement -



చంద్రబాబు, లోకేష్ కుతంత్రాలు బట్టబయలు
తాము దొంగ కేసు పెట్టించామనే విషయం బయటపడిందని గ్రహించిన టీడీపీ.. ఎస్సీ అయిన సత్యవర్థన్ తో వల్లభనేని వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించేందుకు పడిన కుట్ర కూడా వెల్లడయ్యిందని ఈ సందర్భంగా అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఈ కేసులో చంద్రబాబు, లోకేష్ లు చేసిన కుతంత్రాలు బట్ట బయలు అయ్యాయన్నారు. రంగంలోకి దిగిన చంద్రబాబు, లోకేష్ లు సత్యవర్థన్ సోదరుడితో సత్యవర్థన్ ను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేశారని, అతడిని బెదిరించి మేజిస్ట్రేట్ ముందు తప్పుడు వాంగ్మూలం ఇప్పించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయించారని అంబటి చెప్పారు.

ఇంత కన్నా దారుణం ఎక్కడైనా ఉందా?
ఈ కేసులో వల్లభనేని వంశీని క్షణాల్లో పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఇంత కన్నా దారుణం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి వైకాపాలో చేరి గత ఎన్నికల్లో పోటీ చేయడం, తెలుగుదేశం పార్టీపై రాజకీయ విమర్శలు చేశారని వల్లభనేని వంశీపై చంద్రబాబు, లోకేష్ లు కక్షకట్టారని దుయ్యబట్టారు. కొన్ని సందర్బాల్లో వంశీని ఎలిమినేట్ చేసేందుకు కూడా ప్రయత్నించారని చెప్పారు. అనేక తప్పుడు కేసులపై వంశీ న్యాయస్థానాల నుంచి బెయిల్ తెచ్చుకున్నారు.

పోలీసులు, తెలుగుదేశం నేతలు కుమ్మకై వంశీని అరెస్ట్
గుట్టు చప్పుడు కాకుండా నమోదు చేసిన కేసును పోలీసులు కనీసం ఆన్ లైన్ కూడా చేయకుండానే తెల్లవారుజామున వంశీని పోలీసులు అరెస్ట్ చేశారంటే దీని వెనుక ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. పోలీసులు, తెలుగుదేశం నేతలు కుమ్మకై వంశీని అరెస్ట్ చేశారని అంబటి రాంబాబు అన్నారు. కనీసం వంశీని కలిసేందుకు ఆయన సతీమణికి, చివరికి న్యాయవాదులకు కూడా అనుమతి ఇవ్వకపోవటం దారుణం అన్నారు. పోలీసులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.

అబ్బయ్య చౌదరిపైనా తప్పుడు కేసులు
దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అసభ్య పదజాలంతో దూషించి అబ్బయ్య చౌదరిపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారని అంబటి మండిపడ్డారు. రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చెప్పిందే వేదంలా పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు.

డీజీపీపై అంబటి మండిపాటు
సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని తమ రాజకీయ కక్షలకు వినియోగించుకుంటున్నారని విమర్శించారు మంత్రి అంబటి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఒక ప్రణాళిక ప్రకారం అరెస్ట్ చేయడం, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసులను బనాయించడంపై వైసీపీ ప్రతినిధి బృందం డీజీపీని కలిసి వినపతిపత్రం సమర్పించాలని భావించి ముందుగానే అపాయింట్మెంట్ తీసుకున్నా ఫలితం లేదన్నారు. చాలా సేపు తమను కూర్చోబెట్టి తరువాత డీజీపీ వెళ్ళిపోయారు అని పేషీ సిబ్బంది చెప్పటంపై మండిపడ్డారు. ఇదేనా శానసమండలి సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులకు డీజీపీ ఇచ్చే గౌరవం అని నిలదీశారు.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News