Friday, September 20, 2024
Homeనేషనల్BRS: JPCతో అదానీ కుంభకోణంపై విచారణ జరిపించాలి

BRS: JPCతో అదానీ కుంభకోణంపై విచారణ జరిపించాలి

మోడీ అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ రెండు రోజు పార్లమెంటును బహిష్కరించిన బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్షాలు గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష ఎంపీలతో కలిసి ఆందోళనకు దిగారు. అదానీ ఆర్థిక కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని, ఇందుకు గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) నియమించాలని కోరుతూ ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాలను బహిష్కరించాయి. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన అదానీని కేంద్ర ప్రభుత్వం వెనుకేసుకు రావడాన్ని, జేపీసీ వేయకుండా మొండి వైఖరి అవలంభించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ తో ఇతర ప్రతిపక్షాల ఎంపీలు సమావేశాలను బహిష్కరించి పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.

- Advertisement -

ఈ నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎంపీలు సంతోష్ కుమార్,పీ.రాములు,కే.ఆర్.సురేష్ రెడ్డి,బీ.బీ.పాటిల్,కొత్త ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్,రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్,కవిత,మన్నె శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు “జేపీసీని నియమించాలని”, “కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడాలని”, “నిరంకుశ, నియంతృత్వ విధానాలు నశించాలంటూ”పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News