కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు శుభవార్త అందించింది. 2024లో ప్రకృతి విపత్తుల కారణంగా ప్రభావితమైన ఐదు రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) కింద రూ. 1554.99 కోట్ల అదనపు సహాయం అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేతృత్వంలోని జరిగిన ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.1554.99 కోట్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231.75 కోట్లు, నాగాలాండ్కు రూ.170.99 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు మంజూరయ్యాయి.
NDRF Funds: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త
సంబంధిత వార్తలు | RELATED ARTICLES