రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పెట్టుబడి సాయం కింద అందించిఏ పీఎం కిసాన్ (PM Kisan)పథకం 19వ విడత నిధుల విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 24న రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. బీహార్లోని భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ(PM Modi) నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు పేర్కొన్నారు.
పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్పీసీఐ, ఆధార్తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాతో ఈ-కేవైసీ కలిగి ఉండాలి. ఈ పథకానికి సంబంధించి స్టేటస్ తెలుసుకోవడానికి లేదా పీఎం కిసాన్ జాబితాలో పేరు ఉందో లేదో చూడడానికి https://pmkisan.gov.in/సంప్రదించాలి. వివరాలు తెలుసుకోవడానికి మొబైల్ లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి.