Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు అని ఊరికే అనలేదు.. ఇది చూడండి

ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు అని ఊరికే అనలేదు.. ఇది చూడండి

ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు అన్న సామెత ఊరికే రాలేదు. ఇలాంటి ఘటనలకు అలాంటి సామెతలు సరిగ్గా సరిపోతాయి. కళ్లెదురుగా ప్రమాదం జరిగి చావుబ్రతుకుల్లో ఉన్నవారికి పట్టించుకోకుండా.. సెల్ఫీలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే జనాలున్న రోజులివి. తాజాగా కర్నాటక నుంచి వెస్ట్ బెంగాల్ కు చేపల లోడ్ తో వెళ్తున్న లారీ ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో బోల్తా పడింది. లారీ కింద పడటంతో అందులో ఉన్న చేపలు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

- Advertisement -

ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా ? డ్రైవర్, క్లీనర్ పరిస్థితి ఎలా ఉందని కూడా చూడకుండా.. దొరికిందే సందు అన్నట్టుగా.. రోడ్డు మీద కుప్పలు తెప్పలుగా పడిన చేపల కోసం ఎగబడ్డారు. కేజీల కొద్దీ చేపల్ని సంచుల్లో వేసుకుని ఎత్తుకుపోయారు. ఎవరో ఆ సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరలైంది. జనంతీరుపై నెటిజన్లు పేదవి విరుస్తున్నారు. మనిషిలో మానవత్వం, సాయం చేసే గుణం, దయ, జాలి, కనికరం కనుమరుగు అవుతోందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రమాదంలో గాయపడిన డ్రైవర్, క్లీనర్ ను పోలీసులు జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించి, చేపలు ఎత్తుకుపోతున్న జనాల్ని నిలువరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News