Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Education policy: సత్తా లేని చదువులు, ఈపాపం ఎవరిది?

Education policy: సత్తా లేని చదువులు, ఈపాపం ఎవరిది?

బిడ్డ పుట్టకముందే అడ్మిషన్‌ కోసం వెతుకుతున్న రోజులివి సామజిక స్పృహ తెలిసిన ఏ పేరెంట్‌ అయినా అబ్బాయైతే ఇంజినీర్‌.. అమ్మాయైతే డాక్టర్‌ ఇదో ఊతపదంల వల్లేస్తున్నారు. మన సమాజంలో ఇంజినీ రింగ్‌, మెడిసిన్‌ కోర్సులకు ఉన్న క్రేజ్‌ ఇంతా అంతా కాదు. అబ్బాయైతే ఇంజినీర్‌ అని.. అమ్మాయైతే డాక్టర్‌ అని తల్లిదండ్రులు ఆదినుంచీ ఆరాటపడుతుంటారు. ఆ ఆరా టాన్ని ఆసరాగా చేసుకున్న విద్య సంస్థలు నేడు ఇంజినీ రింగ్‌, మెడిసిన్‌ విద్యను వ్యాపారమయం చేసిన పరిస్థితి నెలకొంది. ఐఐటీలు, నిట్‌లు వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో తమ పిల్లలు ఇంజినీరింగ్‌ చదవాలని చాలామంది పేరెంట్స్‌ తపన పడుతుంటారు. ఇందుకోసం వారు ఎం తటి ఖర్చుకైనా వెనుకాడరు. ఈ మధ్య వచ్చిన ‘సార్‌’ సినిమాలో విద్య కొనుగోలు వ్యవహారాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు.
కాన్వెంట్‌ కిచిడి
యూకేజీ మొదలు పరః క్లాస్‌ లోను ప్రత్యేక కోర్స్‌ లే అసలు చదువు నేర్పకుండా కొత్త కోర్స్‌లతో ఆకర్షణ పదాలతో పిల్లలని వలేస్తున్నారు ఒకటో తరగతికి లక్షా పైనే వాసులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయిదో తరగతి పాసైన విద్యార్ధి దగ్గర నుంచి ఒలంపియాడ్‌ అని ఐఐటీ ఫౌండేషన్‌ అంటూ కార్పొరేట్‌ విద్యాసంస్థలు తల్లిదండ్రుల ఆరాటాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. ఇంత ఖర్చుచేసి ఫౌండేషన్‌ కోర్సుల్లో చేర్పించినా జేఈఈలో, ఎంసెట్లో సరైన ర్యాంకురాని వారు ఎందరో ఉంటారు. ఈ కార్పొ రేట్‌ ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకున్న విద్యా ర్థులెందరో సత్యాలు క్రికెట్‌ తప్ప మరేవీ ఆటలు కానట్టు. మానసిక వికాసం లేకుండా ఆటలు టీవీ లోనో మొబైల్‌ లోనో తప్ప మైదానములో అడుగే పెట్టని వారెందరో. క్రాష్‌ కోర్స్‌ అని షార్ట్‌ టర్మ్‌ అని ఇబ్బడి మొబ్బడిగా ఫీజులు వాసులు చేస్తున్నారు, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తప్పితే మిగతా కోర్సులేవీ మంచి చదువులు కావన్న ధోరణి సమా జంలో ప్రబలిపోయింది. ఇతర కోర్సుల్లో చేరేవారిని సగటు విద్యార్థులుగా.. తెలివితేటలు లేనివారిగా పరిగణించడం పరిపాటైంది.
దేశవ్యాప్తంగా అందరినోటా నానుతున్న కోర్సు ఇంజనీరింగ్‌,సింగిల్‌ విండో కౌన్సెలింగ్‌లో కాలేజీల సంఖ్య క్రమంగా పడిపోతోంది. ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్ని కల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) ఆమోదం పొందిన కాలేజీల జాబితాను యూనివర్సిటీలు ఇంకా ఖరారు. చేయనం దున ఈ సంవత్సరం వివరాలు ఇంకా వెలువడలేదు. 2022 ఈ ఏడాది కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకున్న ఇంజి నీరింగ్‌ అభ్యర్థుల సంఖ్య 2.11 లక్షలు దాటింది. 2015-2016 లో దేశవ్యాప్తంగా ఉన్న టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మొత్తం ఇంజినీరింగ్‌ సీట్లు 18 లక్షలు ఉండగా, 2021-22 నాటికి 13.5 లక్షల సీట్లకు తగ్గాయి. ఇందులో 13.29 లక్షల సీట్లు ఉన్నాయి. భర్తీ అవుతున్నది 7.36 లక్షలు. చివరకు ఉద్యోగాలు దక్కించుకుంటున్నది 3.90 లక్షలు మాత్రమే. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాలూకూ లెక్కలివీ. ఆయా కాలేజీలు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడించినప్పటికీ.. వాస్తవానికి ఉద్యోగాలు పొందిన వారు 2.50 లక్షలకు మించకపోవచ్చన్నది నిపుణుల అంచనా. ఇదీ దేశంలో ఇం జినీరింగ్‌ విద్య వాస్తవ పరిస్థితి. (ఏఐసీటీఈ) చేస్తిన్న యాజమాన్య సంతుష్టికారణ నిర్ణయాల కారణంగా ఇంజి నీరింగ్‌ విద్య రోడ్డున పడింది. అంటే ఏ మాత్రం అతిశ యోక్తి కాదు, ఒకప్పుడు ఇంజినీరింగ్‌ కళాశాలకి అనుమతి రావాలంటే 50 ఎకరాల భూమి తప్పనిసరి, కానీ ఇప్పుడు 2 ఎకరాలు ఉంటే చాలు, అదే విధంగా ఒకప్పుడు 12 నుండి 15 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్‌ ఉండాలి అనే నిబంధన ఉండేది ఆనిబంధనను కాస్త ఇప్పుడు 18 నుండి 20 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్‌ ఉంటే చాలు, ఇలా యాజమాన్యాల పైరవీలకి తలొగ్గి నిబంధనలకు తూట్లు పొడిచి ఏఐసీటీఈ నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్యను విద్యా ర్థులకు దూరం చేసింది
నైపుణ్య లేమి
సాధారణంగా ఓ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చేసిన విద్యార్ధిని హౌస్‌ వైరింగ్‌ చేయమన్న, లేదా ఓ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చేసిన విద్యార్ధి నైనా సిస్టం ఫార్మట్‌ చెయ్య మన్నా ఏ ఎలక్ట్రిసీయాన్‌ నో లేక వైసీటీసీ తీసుకెళ్లాలి తప్ప స్వంతగా నేర్చుకున్న విద్యను సామాజిక అవసరాలకు అనుసంధానించలేకపోతున్నాము. స్కూల్‌ విద్య నుండి డిగ్రీ వరకు రాంక్‌లు తప్ప ప్రాక్టికల్‌ టైం పాస్‌ సబ్జెక్ట్‌గ మిగిలిపోయాయి. పుస్తకాలు చదివే ఓపిక లేదు ఆన్‌ లైన్‌ మద్యమాల్లో కాపీ చేయడమే తప్ప స్వతహాగా కోడ్‌ రాసెడి కష్టమే, మెకానికల్‌ కుర్రాడు బైక్‌ రిపేర్‌ చేయ్యలేదు ,అంటే థర్మల్‌ ఇంజినీరింగ్‌ ల్యాబ్ల్యాబ్‌ లోటూ స్ట్రోక్‌ ఫోర్‌ స్ట్రోక్‌ ఇంజిన్‌ ప్రయాగాలు అర్థవంతంగా అర్థం చేసుకోలేదని అర్థం. ఇది ఒక విద్యార్థి లోపమే కాదు, విషయ పరి జ్ఞానము కలిగిన అనుభవం ఉన్న అధ్యాపక బృందాలు లేకపోవడం, కాలేజీలు విద్యాలయాలు క్వాలిటీ అధ్యాపకు లను నియమించుపోకపోవువటం, అంగట్లో సరుకుల్ల సర్టి ఫికేట్‌ కొనుక్కొని తక్కువ జీతాలకు జైన్‌ అవుతున్న వారికె అవకాశం తప్ప రీసెర్చ్‌ మరియు అకడెమిక్‌ ఎక్స్లెన్స్‌ పైన దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరం అందువల్ల ఓ సత్య నాదెళ్ళ, సుందర్‌ పిచాయ్‌ లాంటి వాళ్ళు ఈ తరంలో వస్తారన్నది నిరాశే.
సాంకేతిక ప్రతిభకు గ్లోబల్‌ కొరత
నైపుణ్యం కోసం ఒక కొత్త దారి తప్పదు! క్యాప్‌ జెమినీ అధ్యయనంలో 55% సంస్థలో స్టీమ్‌ నైపుణ్యాలకు భారీ గ్యాప్‌ ఉండటమే కాకుండా అది విస్తరిస్తోంది. అని అంగీకరించినట్లు వెల్లడించింది. 2022 నాటికి కూడా 30% టెక్‌ ఉద్యోగాలు డిజిటల్‌లో సంబంధిత ప్రతిభ అందుబాటులో లేకపోవడం వల్ల కాలీగానే ఉంటాయని గార్ట్‌నర్‌ అంచనా వేసింది. ప్రముఖ ఏజెన్సీ ద్వారా సర్వే ద్వారా తెలిసినది ఏంటంటే 40% మంది యజమానులు నైపుణ్యం కలిగిన ప్రతిభను కనుగొనడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 2022లో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఉద్యోగాల సంఖ్య 1.4 మిలియన్‌ కానీ దానికి అర్హత కలి గిన దరఖాస్తుదారులు లేరు. డిమాండ్‌కు సరిపడ సము చితమైన నైపుణ్యాలు కలిగిన వారు లేరు 77% ఐటీ నిర్ణ యాధికారులు తీసుకునే వారు ఐఓటీకి అవసరమైన నైపు ణ్యాలను కలిగి 47% వారి వారి సంస్థల్లో ఐఓటీ నైపు ణ్యాలు కలిగిన వారు లేరని చెప్పారువచ్చే వచ్చే 3 సంవత్స రాల్లో 3 మిలియన్ల సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు తక్షణ అవసరమని నాస్కామ్‌ సర్వే చెపుతుంది అదే విధంగా, అదే విధంగా గ్రామీనా వ్యవస్థలో నిరుద్యోగం తాండవిస్తుంది చదువుకున వ్యాక్యాహై రాజకీయ కార్యకరతగా తప్ప నైపుణ్యం కలిగి నలుగురికి ఉపాధి మార్గం చూపే దిశలో లేరు. వ్యవసాయ మరియు దాని అనుబంధ సంస్థాలకు విద్య మరియు పరిశోధనలు ముమ్మురంగా జరపాల్సి ఉం టుంది. వ్యవసాయ రంగం తగినంతగా అందించడంలో విఫలమైతే గ్రీన్‌ గ్రోత్‌ ప్రమాదంలో పడుతుంది. పెరుగు తున్న ప్రపంచ జనాభాకు ఆహారం విదేశీ ఆహార పదా ర్థాలు డిమాండ్‌ పెరిగే అవకాశాలెక్కువ, అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో, వ్యవసాయం ప్రధాన ఆర్థిక పాత్ర పోషిస్తుంది. జీడీపీలో 30% మరియు ఉపాధిలో మూడిం ట రెండు వంతుల వాటా. గ్లోబల్‌ ఫుడ్‌ అని అంచనా వేసి నందున 2050లో ఊహించిన ప్రపంచ జనాభాకు ఆహా రం అందించడానికి ఉత్పత్తిని 70% పెంచాలి. వ్యవసా యంలో ఆర్థిక సామర్థ్యం మరియు ఉత్పాదకత అవసరం నాస్కామ్‌ ప్రకారం, భారతదేశంలో దాదాపు 12,000 టెక్‌ స్టార్టప్‌లు ఉన్నాయి. వాటిలో 3,000 డీప్‌ టెక్‌ స్టార్టప్‌లు. 2026 నాటికి, నాస్కామ్‌ అంచనా ప్రకారం భారతీయ ఉత్పత్తి కంపెనీలు రోజుకి డాల్లర్‌ 13 బిలియన్ల నుండి డాల్లర్‌ 30 బిలియన్ల ఆదాయాన్ని చేరుకుంటాయి. గత కొన్ని సంవత్సరాలలో, భారతదేశం నుండి చాలా విజయ వంతమైన సాస్‌-ఆధారిత ఉత్పత్తి సంస్థలు ఉద్భవించాయి. జోహో, ఫ్రెష్‌వర్క్స్‌, ఖాటాబుక్‌, టాల్‌వ్యూ మరియు క్లౌడ్‌ కనెక్ట్‌ వంటి ఉత్పత్తి స్టార్టప్‌లు ఇప్పటికే భారతదేశం నుండి ప్రపంచ ఉత్పత్తులను నిర్మిస్తున్నాయి ఉత్పత్తుల విషయా నికి వస్తే మాకు చాలా టాలెంట్‌ గ్యాప్‌ ఉంది. ఇందులో ఉత్పత్తి నిర్వహణ, రూపకల్పన, విశ్లేషణలు, ఉత్పత్తి మార్కె టింగ్‌ మరియు ఉత్పత్తి విక్రయాలు వంటి విభాగాలు ఉన్నాయి. ఇవి మనం రీ స్కిల్‌తో పెంపొందించుకో వాల్సిన నైపుణ్యాలు. 2025 నాటికి భారతదేశం నుండి 50,000 మంది ప్రొడక్ట్‌ మేనేజర్లను కలిగి ఉండాలనేది మా ఆశయం అని నాస్కామ్‌ ప్రొడక్ట్‌ కౌన్సిల్‌ చైర్‌ రామ్‌ కుమార్‌ నారాయణన్‌ అన్నారు అంటే ఉద్యాగాలకు కొదవ లేదని అరతమవుతుంది కానీ నైపుణ్యత నిరూపించు కోవడం కష్టమే.
నాల్గవ పారిశ్రామిక విప్లవం కారణంగా, భారీ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సులు (ఎంఓఓసీ), వర్చువల్‌ క్లాస్‌రూమ్‌లు, వర్చువల్‌ లైబ్రరీలు, వర్చువల్‌ లాబొరేటరీలు మరియు వర్చువల్‌ అధ్యాపకులతో సహా విభిన్నంగా విద్య, పరి శోధన మరియు సేవలను అందించే ఆధునిక మరియు అధునాతన విద్యాసంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఎడ్యుకేషన్‌ 4.0 కూడా పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యా లయాలను తమను తాము అప్‌గ్రేడ్‌ చేసుకునేలా చేస్తుంది. స్మార్ట్‌ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మరియు రోబోటిక్స్‌ పారిశ్రామిక విప్లవం మన దైనందిన జీవితా లను ఎలా ప్రభావితం చేసిందో చెప్పడానికి కొన్ని ఉదాహ రణలు మాత్రమే. అందువల్ల, పోటీతత్వాన్ని కొనసాగించ డానికి, విద్యా సంస్థలు సైబర్‌-భౌతిక వ్యవస్థలు వాస్త వంగా ప్రతి పరిశ్రమను విస్తరించే ప్రపంచానికి విద్యార్థు లను సన్నద్ధం చేయాలి.
కెరీర్‌ను తీర్చిదిద్దుకొనే తరుణం ఇదే..
ఏదో ఒక కోర్సు అనే అలసత్వ ధోరణితో కాకుండా, పకడ్బందీగా ప్లాన్‌ చేసుకుంటే సక్సెస్‌ఫుల్‌ కెరీర్‌ సాధ్యమే.. విద్యార్థి దశలో అత్యంత కీలకమైన ఈ సమయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోకుంటే అవస్థలు తప్పవు. దురదృష్ట వశాత్తూ, నిరుద్యోగం ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయిలలో పేలవమైన బోధనతో మరియు ఉన్నత విద్య యొక్క నాణ్యతకు సంబంధించినదని కొద్దిమంది మాత్రమే గ్రహించారు. ఉపాధిని పొందలేని వారు, వృత్తి విద్యా కోర్సులు, శిక్షణ పొందలేని వారు ఏ స్థాయిలోనైనా ఉపాధి పొందేందుకు వీలుగా, ఆర్థిక స్థోమత కలిగినప్పుడు తిరిగి చదువులకు వెళ్లేందుకు వీలుగా పాఠ్యాంశాలను పునర్‌ వ్యవస్థీకరించాలి. ఇది ఉన్నత విద్యా వ్యవస్థపై ప్రస్తుత భారాన్ని తగ్గించడమే కాకుండా వివిధ స్థాయిలలో ఉపాధి కోసం గుణాత్మక ఉత్పత్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది. విద్య ఎప్పటికీ అంతం కాదని, ఇది సుదీర్ఘ ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి.
డాక్టర్‌ కృష్ణ సామల్ల
ప్రొఫెసర్‌ & ఫ్రీ లాన్స్‌ జర్నలిస్ట్‌
– 9705890045

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News