Sunday, October 6, 2024
HomeతెలంగాణManchiryala: ఇందారం చెక్ పోస్టు వద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించిన హరీష్

Manchiryala: ఇందారం చెక్ పోస్టు వద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించిన హరీష్

మంచిర్యాల జిల్లా ఇందారం చెక్ పోస్టు వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభించారు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

60 ఏళ్లలో కానీ పనులను నాలుగేళ్లలో బాల్క సుమన్ చేసి చూపుతున్నారని ఈ సందర్భంగా హరీష్ ప్రశంసించారు. చెన్నూరు దశ దిశ మారిందని, అద్భుతంగా తీర్చి దిద్దారన్నారు. సుమన్ కోరిక మేరకు, సీఎం కేసీఆర్ కి తెలియజేసి జైపూర్ పవర్ ప్లాంట్ లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తామని హరీష్ ఈసందర్భంగా స్థానికులకు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News