Wednesday, February 26, 2025
HomeదైవంMaha Shivaratri: శివ పూజలో అభిషేకం, బిల్వ పత్రం ప్రాముఖ్యత తెలుసా..?

Maha Shivaratri: శివ పూజలో అభిషేకం, బిల్వ పత్రం ప్రాముఖ్యత తెలుసా..?

మహాశివరాత్రి హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ. ఆ రోజు శంకరుడిని ప్రత్యేకంగా పూజిస్తుంటారు. ఇలా పూజించడం ద్వారా జీవితంలో ఆనందానికి లోటుండదని పండితులు చెబుతుంటారు. ఎప్పుడూ ఆనందానికి లోటు ఉండదు. దేవతల్లో శివునికి అత్యున్నత స్థానం ఉంది. అందుకే శివయ్యని మహాదేవ్ అని అంటుంటారు. ఇక శివుడు సులభంగా ప్రసన్నం అవుతాడని పురాణాలు చెబుతున్నాయి. భోలాశంకరుడుగా అందుకే ప్రసిద్ధి చెందాడు. బిల్వపత్రం, నీటితో శివ లింగాన్ని పూజిస్తే చాలు. శివయ్య ఆశీస్సులు మీతో ఉంటాయని అంటుంటారు.

- Advertisement -

శివ మహాపురాణం ప్రకారం భూమిపై సంభవించిన మహా జలప్రళయం కారణంగా అన్ని విలువైన రత్నాలు, ముఖ్యమైన మందులు సముద్రంలో కలిసిపోయాయి. ఆ సమయంలో దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మథనం చేస్తారు. సముద్ర మథనం సమయంలో కాలకూట విషం విడుదలైనప్పుడు ముల్లోకాల్లోని జీవాలు ఆందోళన చెందుతాయి. ఈ విషం అత్యంత ప్రమాదకరమైనది. దీంతో తమను రక్షించమని దేవతలు, రాక్షసులు శంకరుడిని ప్రార్థిస్తారు. విష ప్రభావాన్ని భూమిని రక్షించడానికి మహాదేవుడు స్వయంగా ఆ విషాన్ని తాగాడు. హాలాహల విషం కారణంగా, శివుని గొంతు నీలం రంగులోకి మారింది. అంటే ఆకాశం రంగులోకి మారింది. అందుకే శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు.

ఈ విషం కారణంగా, భోలానాథ్ శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది. దీని కారణంగా అతను చాలా సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించాడు. కైలాసం లాంటి చల్లని ప్రదేశంలో కూడా భోలానాథ్ విపరీతంగా చెమటలు పడుతున్నట్లు చూసి దేవతలు, రాక్షసులు శివుడిని నీటితో అభిషేకించారు. అప్పటి నుండి శివుడికి అభిషేకం చేసే ఆచారం ప్రారంభమైంది. ఇక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా ఉండే బిల్వ పత్రాన్ని సమర్పించడం ఉత్తమమని పండితులు చెబుతుంటారు. అంతేకాదు శివునికి ఇష్టమైన మంత్రం – ‘ఓం నమః శివాయ’ జపించండి ఇది జపించినా అద్భుత ఫలితాలు ఉంటాయని చెబుతారు. ఇక విశ్వాసం, భక్తితో ఉపవాసం ఉండటం ద్వారా శివుని అనుగ్రహాన్ని పొందండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News