Thursday, February 27, 2025
Homeఆంధ్రప్రదేశ్Anjani Kumar: ఏపీలో రిపోర్ట్ చేసిన తెలంగాణ మాజీ డీజీపీ

Anjani Kumar: ఏపీలో రిపోర్ట్ చేసిన తెలంగాణ మాజీ డీజీపీ

సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్(Anjani Kumar) తెలంగాణ నుంచి రిలీవ్ కావడంతో ఏపీ‎లో రిపోర్టు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో అంజనీ కుమార్ ఏపీకి కేటాయించబడ్డారు. కానీ గత పదేళ్లుగా ఆయన తెలంగాణలోనే పని చేస్తున్నారు. ఈ క్రమంలో అంజనీ కుమార్‎ను ఏపీకి వెళ్లాలని కేంద్రహోంశాఖ ఇటీవల ఆదేశించింది. కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం అంజనీ కుమార్‎ను రిలీవ్ చేసింది. దీంతో ఆయన ఏపీలో రిపోర్టు చేయాల్సి వచ్చింది. గతంలో తెలంగాణ డీజీపీగా పనిచేసిన ఆయనకు ఏపీ ప్రభుత్వ ఎలాంటి పోస్టు ఇస్తుందో వేచి చూడాలి.

- Advertisement -

ఇక అంజనీ కుమార్‎తో పాటు రిలీవ్ అయిన మరో ఐపీఎస్ ఆఫీసర్ అభిలాష బిష్ట్ మాత్రం క్యాట్‎ను ఆశ్రయించారు. డీవోపీటీ ఉత్తర్వులపై స్టే విధించాలని ఆమె కోరారు. ఈ పిటిషన్‎పై స్పందించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు క్యాట్ నోటీసులు జారీ చేసింది. ప్రతివాదుల వాదనలు విన్న తరువాత తీర్పు వెళ్లడిస్తామని స్పష్టం చేసింది. కానీ అప్పటి వరకు డీవోపీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వెంటనే ఏపీకి వెళ్లి రిపోర్టు చేయాల్సిందిగా క్యాట్ ఆదేశించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News