Saturday, March 1, 2025
HomeతెలంగాణKTR: మంత్రులు చేపకూరతో విందులు.. విద్యార్థులేమో పస్తులు: కేటీఆర్

KTR: మంత్రులు చేపకూరతో విందులు.. విద్యార్థులేమో పస్తులు: కేటీఆర్

తెలంగాణలో ప్రజాపాలన పరాకాష్టకు చేరిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. విషాదంలోనూ మంత్రులు వినోదాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. హెలికాప్టర్‌లో యాత్రలు చేస్తూ, చేపకూరతో విందు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“అన్నం వండలేదు గుడిలో తినండి” అని విద్యార్థులకు ఆదేశాలు ఇచ్చిన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల ఎస్టీ బాలుర హాస్టల్ సిబ్బంది. కొండనాగులలోని ఎస్టీ బాలుర హాస్టల్లో శివరాత్రి పండుగ రోజు 380 మందికి గాను 200 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే మధ్యాహ్న భోజనం గుదిబండ శివాలయంలో చేసే అన్నదానానికి వెళ్ళి తినాలని, రాత్రి భోజనం కోసం వీరం రామాజిపల్లిలోని గంగమ్మ దేవాలయంలో అన్నదానానికి వెళ్లి తినమని విద్యార్థులకు చెప్పి వంట చేయడం మానేసిన హాస్టల్ సిబ్బంది. భోజనం కోసం అంత దూరం నడిచి వెళ్ళే ఓపిక లేక పస్తులు ఉన్న విద్యార్థులు. పండగ పూట విద్యార్థులకు కనీసం భోజనం పెట్టకుండా, అన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తినమని చెప్పడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, విద్యార్థుల తల్లితండ్రులు. పండగపూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలనా. జాగో తెలంగాణ జాగో” అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News