Friday, April 11, 2025
HomeతెలంగాణManchiryala: భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభం

Manchiryala: భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభం

మంచిర్యాలలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే, ఎఐసిసి కార్యదర్శులు నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు, పిసిసి మాజీ అధ్యక్షులు విహెచ్ హనుమంతరావు, భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం భట్టీ విక్రమార్క పాదయాత్రను ప్రారంభించారు.

- Advertisement -

సిఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించిన ఈ పాదయాత్రలో బ్యాండ్ మేళాలు, డప్పుల దరువులు, గిరిజనుల గుస్సాడి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిప్పిరి గ్రామానికి కదిలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పిప్పిరి జనసంద్రంగా మారింది. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావీద్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News