మహిళా సంఘాల(Women Groups)కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు ఆర్టీసీ(RTC Buses)అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. తొలి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించింది. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనుంది. ప్రతి నెలా ఒక్కో బస్సుకు రూ. 77,220 చొప్పున ఆర్టీసీ అద్దె చెల్లించనుంది.
- Advertisement -
బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది. త్వరలోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.
