తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, మరో నిందితుడు శ్రవణ్రావు అమెరికాలో ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరిని తెలంగాణకు తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరిపై రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా సీబీఐ నుంచి ఇంటర్పోల్(Interpol)కు రెడ్ కార్నర్ నోటీసులు అందాయి.
మరోవైపు వీరిద్దరు అమెరికా వదిలి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. బెల్జియం లేదా కెనడాలో తలదాచుకున్నట్లు అధికారులు గుర్తించారు. తాజాగా ఇంటర్పోల్కు రెడ్ కార్నర్ నోటీసులు అందడంతో ఏ దేశంలో ఉన్నా సరే నిందితులను పట్టుకుని హైదరాబాద్ తీసుకురానున్నారు. వీరిద్దరు హైదరాబాద్ వచ్చాక ఈ కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.