Monday, March 10, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: కూటమి ప్రభుత్వంలో మహిళా సాధికారత ఇదేనా..?: షర్మిల

YS Sharmila: కూటమి ప్రభుత్వంలో మహిళా సాధికారత ఇదేనా..?: షర్మిల

కూటమి ప్రభుత్వంలో మహిళా సాధికారత ఇదేనా..? అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు అమల్లో ప్రభుత్వం నిబంధనలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా.. దాటాక బోడి మల్లన్నలా ఉంది కూటమి ప్రభుత్వ తీరు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ..ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి, ఓట్లు వేయించుకొని, ఇప్పుడు కండీషన్ అప్లై అనడం దారుణం. జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసం. అమలు చేయాలన్న చిత్తశుద్ది లేక చెప్పే సాకులు. ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే మరి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలను మోసం చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేశారు. రాష్ట్రాల పర్యటన పేరుతో విహార యాత్రలు చేశారు. పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం.. రేపు అమల్లోకి తెచ్చే సరికి నియోజక వర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణమే. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడినుంచి ఎక్కడికైనా అంతా ఉచితమే. ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎంతదూరమైనా జీరో టికెట్. ఇలాంటి మంచి పథకాన్ని, అతి తక్కువ ఖర్చుతో మహిళలకు మేలు జరిగే హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడం లేదు. నెలకు రూ.350 కోట్లు మహిళల కోసం ఆర్టీసికి ఇవ్వడానికి ధైర్యం చాలడం లేదు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభనష్టాలు చూడాలా ? ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న మహిళా సాధికారిత ? తక్షణం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని, రాష్ట్రం అంతా ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండాలని రాష్ట్రంలోని మహిళల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.” అని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News