2018లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ ఆత్మహత్య(Pranay Murder Case) కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. అలాగే ఏ3 అస్గర్ అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాంలకు జీవితఖైదు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరిలో ఇప్పటికే సుభాష్శర్మ జైలులోనే ఉండగా అస్గర్ అలీ వేరే కేసులో జైలులో ఉన్నారు. మిగిలిన నిందితులు బెయిల్పై బయటకు వచ్చారు.
కాగా మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్ ఇద్దరు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ హత్యకు సుపారీ ఇచ్చాడు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రి వద్ద నిందితులు ప్రణయ్ని అతి కిరాతకంగా చంపారు. ఈ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ పూర్తి చేపట్టి ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఇక ఏ1 నిందితుడిగా ఉన్న మారుతీరావు 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
