ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్గేట్ వద్ద భారీగా బంగారాన్ని(Gold) పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.3.38 కోట్ల విలువైన 4.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సరైన బిల్లులు లేకుండా చెన్నై నుంచి నెల్లూరులోని ఓ దుకాణానికి బంగారం తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా బంగారం తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు కారును సీజ్ చేసినట్లు వెల్లడించారు.
Gold: నెల్లూరు జిల్లాలో భారీగా బంగారం పట్టివేత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES