ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లు స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) చెన్నై చేరుకున్నాడు. మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్లో(IPL 2025) చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో చేరాడు. అక్కడ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొననున్నాడు.
- Advertisement -
ఈ సందర్భంగా చెన్నై చేరుకున్న జడ్డూ పుష్ప స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సీఎస్కే జట్టు సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో తగ్గేదేలే అంటూ పుష్ప మూవీలోని డైలాగ్ అనుకరించాడు. ‘జడ్డూ అంటే పేరు అనుకున్నావా బ్రాండ్’ అని చెప్పాడు.