Wednesday, March 12, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: అంగన్‌వాడీల నిర్బంధం ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనం: షర్మిల

YS Sharmila: అంగన్‌వాడీల నిర్బంధం ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనం: షర్మిల

తమ గోడు వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. అంగన్‌వాడీల ధర్నాలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

“అధికారంలో వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి.. ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తుంది కూటమి ప్రభుత్వం. మాట తప్పి మోసం చేయడం అంటే ఇదే మరి. తమ గోడు వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనం. వారి గొంతు నొక్కి, ఆందోళలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంత చేష్టలకు పరాకాష్ట. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవి. వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చించాలి.

అంగన్వాడీలకు నెలకు గౌరవ వేతనం రూ.26వేలు ఇవ్వాలి. తక్షణం గ్రాట్యూటి చెల్లింపు హామీని అమలు చేయాలి. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలి. హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. విధి నిర్వహణలో అంగన్వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు మట్టి ఖర్చుల కింద రూ.20వేలు ఇవ్వాలి. వీటితో పాటు ఇతర 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం” అని తెలిపారు.

https://twitter.com/realyssharmila/status/1899357796904452210
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News